(తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి)
తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అంతకముందు మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో గవర్నర్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. టీటీడీ చైర్మన్,ఈఓలు స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల శుభవేళ స్వామివారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు.