గ్రీన్ దీపావళి చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం : తెలంగాణా గవర్నర్

పర్యావరణ హితమైన గ్రీన్ దీపావళిని జరపుకోవాలని తెలుగు ప్రజలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై సూచించారు.

Update: 2019-10-23 06:58 GMT

                                                                       (తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

పర్యావరణ హితమైన గ్రీన్ దీపావళిని జరపుకోవాలని తెలుగు ప్రజలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై సూచించారు. శ్రీవారి దర్శనార్థం నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆమె, ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో పండితులు తమిళిసై కుటుంబానికి వేదాశీర్వాచనం చేయగా, టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమిళిసై గవర్నర్ హోదాలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..ఈ సందర్భంగా ఆమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


Delete Edit




Tags:    

Similar News