శ్రీవారికి మొక్కులు చెల్లించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

తిరుమల శ్రీవారిని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దర్శించుకున్నారు.

Update: 2019-11-16 05:00 GMT

( తిరుమల, శ్యామ్ నాయుడు )

తిరుమల శ్రీవారిని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆమె ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విజయశాంతికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు, అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన విజయశాంతితో పలువురు అభిమానులు ఫోటోలు, సెల్పీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.

Tags: Vijayashanthi, Tirumala, Temple , Congress Leader

Tags:    

Similar News