రచయితకు షాక్: రెండు గుడ్లు 1700.. రెండు ఆమ్లెట్లు 1700.. బిల్లేసిన స్టార్ హోటల్!

మొన్నామధ్య.. చంఢీగడ్‌లోని మారియట్‌ హోటల్‌ రెండు అరటి పండ్లకు రూ.443 బిల్లు వసూలు చేసిన విషయం మరువక ముందే..ముంబై లోని ఒక హోటల్ ఇప్పుడు రెండు గుడ్లకు ఏకంగా 1700 వసూలు చేసి రికార్డు సృష్టించింది

Update: 2019-08-11 15:29 GMT

మొన్నామధ్య.. చంఢీగడ్‌లోని మారియట్‌ హోటల్‌ రెండు అరటి పండ్లకు రూ.443 బిల్లు వసూలు చేసిన విషయం గుర్తుండే వుంటుంది. సరిగ్గా అలాగే ఇంకా చెప్పాలంటే ఇంకా దారుణంగా.. మరో హోటల్ బిల్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ ఈసారి ఈ నిర్వాకం వెలగబెట్టింది . 'ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌' పుస్తక రచయిత కార్తీక్‌ దార్‌ ఇటీవల ఆ హోటల్ కి వెళ్ళినపుడు రెండు గుడ్లకు 1700 వసూలు చేసిందని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'నిరసన వ్యక్తం చేద్దామా భాయ్‌..!' అని క్యాప్షన్‌ పెట్టాడు.

అయన పోస్ట్ చేసిన బిల్లులో రెండు గుడ్లకు 1700 తో పాటు, రెండు ఆమ్లెట్ లకు కూడా 1700 బిల్లు వేసినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఇంకా సదరు హోటల్ స్పందించకపోయినా.. నెటిజన్లు మాత్రం బాగానే స్పందిస్తున్నారు. గుడ్లతో పటు బంగారం కూడా ఇచ్చారా అని ఒకరు.. చికెన్ తినాలంటే డబ్బున్న కుటుంబంలోనే పుట్టాలేమో అని ఒకరూ ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు.



Tags:    

Similar News