ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్ప రెడీ!

Update: 2019-07-26 04:59 GMT

కర్ణాటక‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప గవర్నర్ వాజూ‌భాయ్ వాలా‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ కేవలం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటివలే కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. తాజా నిన్న ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఒక్క పక్క కాంగ్రెస్, జేడీయూ మళ్లీ పావులు కదుపుతుంటే.. యడ్యూరప్ప అధికారంలోకి రావడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News