కేంద్రం ఆదేశాల మేరకు ఈ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాదాపు 7 వారాల తరువాత షాపులు తెరిచేసరికి మద్యం షాపుల వద్ద జనాలు భారీ ఎత్తున లిక్కర్ కోసం క్యూ కట్టారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. కాగా మందుబాబులే కాదు మందుమహిళలు కూడా రోడ్డెక్కారు.
బెంగళూరులో ఓ మద్యం దుకాణం ఎదుట మహిళలు క్యూలో నిల్చుని ఉన్న ఫొటో ఒక్కటి ఇప్పుడు వైరల్గా మారింది. అయితే, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి కాస్త వాళ్లకు ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేశారు నిర్వాహకులు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్న మహిళలు ఈ ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు ఎందుకేయాలనుకున్నారేమో ఏకంగా లిక్కర్ షాపుల ముందే క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.