నోయిడాలోని సెక్టార్‌-21లో కూలిన ప్రహరీ గోడ

*9 మందిని కాపాడిన సహాయక బృందాలు

Update: 2022-09-20 06:45 GMT

నోయిడాలోని సెక్టార్‌-21లో కూలిన ప్రహరీ గోడ

Noida: ఉత్తరప్రదేశ్‌ నోయిడా సెక్టార్‌-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింది చిక్కుకొని ఉన్న 9 మందిని సహాయక బృందాలు కాపాడాయి. డ్రెయిన్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని.. శిథిలాలను తొలగిస్తున్నాయి. 

Tags:    

Similar News