మహారాష్ట్ర, హర్యానాలో ఊపందుకుంటున్న పోలింగ్

Update: 2019-10-21 05:26 GMT

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే ఓటింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లోని ఓటింగ్ కేంద్రాల దగ్గర జనం తక్కువగా కనిపిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు అధికంగా ఉన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్త లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలియజేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, NCP నేత సుప్రియ సూలే ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

Tags:    

Similar News