కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మిస్సింగ్ ట్రాజిడిగా మారింది. రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన అయన ఆత్మహత్య చేసుకున్నారు. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాం లభించింది. అయితే అయన ఆత్మహత్యపై విదేశాల్లో దాకున్న ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా స్పందించాడు . సిద్దార్థ మరణానికి ప్రభుత్వ యంత్రాంగం వేధింపులే నిదర్శనమని తనని కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చాడు మాల్యా..
" నాకు పరోక్షంగా వీజీ సిద్ధార్థతో సంబంధం ఉంది. ఆయనొక అద్భుతమైన మానవ మరియు తెలివైన వ్యవస్థాపకుడు. ఆయన లేఖలోని విషయాలతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రభుత్వ ఏజెన్సీలు మరియు బ్యాంకులు ఎవరినైనా నిరాశకు గురిచేస్తాయి. పూర్తిగా తిరిగి చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారో చూడండి. పాశ్చాత్య దేశాలలో, ప్రభుత్వం మరియు బ్యాంకులు రుణగ్రహీతలు తమ అప్పులను తిరిగి చెల్లించటానికి సహాయపడతాయి. అంటూ విజయ్ మాల్యా తన ట్విట్టర్ ఖాతా లో స్పందించాడు ..
I am indirectly related to VG Siddhartha. Excellent human and brilliant entrepreneur. I am devastated with the contents of his letter. The Govt Agencies and Banks can drive anyone to despair. See what they are doing to me despite offer of full repayment. Vicious and unrelenting.
— Vijay Mallya (@TheVijayMallya) July 30, 2019