మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. కాగా విచారణలో లండన్లో ఎలాంటి ఆస్తులూ లేవని ఈడీకి తెలిపినట్టు తెలుస్తోంది. లండన్లో తన తరపున ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చక్కబెట్టిన మనోజ్ అరోరా గురించి ఈడీ ప్రశ్నించగా అరోరా గతంలో తన వద్ద పనిచేసిన ఉద్యోగిగా తెలుసని, ఆయన తన తరపున ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని వాద్రా దర్యాప్తు అధికారులకు తెలిపారు.
ఆస్తుల వివరాలపై బుధవారం ఆయనను ప్రశ్నించిన ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద వాద్రా స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అంతకుముందు వాద్రాను ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు నేరుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.