CAA, ఢిల్లీ హింసాత్మక ఘటనలపై స్పందించిన ట్రంప్‌

Update: 2020-02-25 13:08 GMT
CAA, ఢిల్లీ హింసాత్మక ఘటనలపై స్పందించిన ట్రంప్‌

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఢిల్లీలో తాజా హింసాత్మక ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.

మంగళవారం సాయంత్రం ట్రంప్‌ మీడియా భేటీ సందర్భంగా దేశ రాజధానిలో తలెత్తిన హింసాత్మక నిరసనలను ప్రస్తావించగా ఈ ఘటనలను తాను విన్నానని, కానీ వీటిపై తాను చర్చించలేదని, ఇది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఇక మోదీ మాటల్లోనే కాదు చేతల్లోనూ ధృడంగా ఉంటారని ప్రశంసించారు.



Tags:    

Similar News