హైదరాబాద్ జేఎన్యూ క్యాంపస్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్కు చేదు అనుభవం ఎదురయింది. ఆర్టికల్ 370 ను రద్దు చేయడం వెనుక ఉద్దేశాన్ని వివరించేందుకు సిద్ధమౌతున్న మంత్రిని వామపక్ష విద్యార్ధి సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. కేంద్ర మంత్రి ప్రసంగానికి అడ్డుపడిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా అందించిన భావ వ్యక్తీకరణ హక్కుకు వ్యతిరేకంగా విద్యార్ధులు పనిచేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని..అడ్డుకునే హక్కులేదని కృష్ణసాగర్రావు అన్నారు. కేంద్ర మంత్రి కార్యక్రమానికి ఆటంకం కలిగించిన విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణసాగర్రావు డిమాండ్ చేశారు.