మహారాష్ట్ర ముఖ్యమంత్రగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించారు ఉద్దవ్ థాక్రే. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాక్రే.. అనంతరం తన సభకు హాజరైన ప్రజలకు శిరసు వంచి నమస్కరించారు.