యూపీ మొరాదాబాద్‌లో పెళ్లివేడుకలో విషాదం

Uttar Pradesh: మూడంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు

Update: 2022-08-26 06:15 GMT

యూపీ మొరాదాబాద్‌లో పెళ్లివేడుకలో విషాదం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలో వివాహ వేడుక జరుగుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని, మంటలను అదుపుచేసింది. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News