Tamilisai: ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై
Tamilisai: తమిళనాడులోని చెన్నై సౌత్నుంచి బరిలో నిలుస్తున్న తమిళిసై
Tamilisai: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలోని చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి ఆమె బీజేపీ తరపున పోటీలో ఉండబోతున్నారు. ఈ సందర్భంగా కోయంబేడు శివన్ టెంపుల్ నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. ఇన్నిరోజులు గవర్నర్ బాధ్యతల్లో ఉన్న ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ప్రచారంలో భాగంగా ఆమె ఓ హోటల్ను సందర్శించారు. అక్కడ విక్రయిస్తోన్న వడలను ఆమె టేస్ట్ చేశారు. కార్యకర్తలకు కూడా పంపిణీ చేశారు. అనంతరం తన ఫోన్ నుంచి ఆన్లైన్ పేమెంట్ చేశారు.