పొంగల్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. పొంగల్ వండి అందరికీ పంచిన గవర్నర్ !
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను చెన్నైలో జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తమిళనాడు - తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటాను అని తెలిపారు. సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రాచీన, అద్భుత సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై స్వయంగా పొంగల్ వండి అందరికీ పంచారు.
Tamil Nadu: Telangana Governor Tamilisai Soundararajan celebrates the festival of #Pongal with her family at her residence in Chennai. pic.twitter.com/WGIauFZMaB
— ANI (@ANI) January 14, 2020