పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.. పొంగల్‌ వండి అందరికీ పంచిన గవర్నర్‌ !

Update: 2020-01-14 08:19 GMT
పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సంక్రాంతి పండుగను చెన్నైలో జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ తమిళనాడు - తెలంగాణకు మధ్య తాను వారధిలా ఉంటాను అని తెలిపారు. సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు‌. ప్రాచీన, అద్భుత సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై స్వయంగా పొంగల్‌ వండి అందరికీ పంచారు.



Tags:    

Similar News