బాబోయ్.. లాక్ డౌన్ లో షికార్లు చేస్తే..ఇలా వుంటుంది! ఆ పోలీసుల వింత శిక్ష వైరల్!

Update: 2020-04-24 08:23 GMT

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ ను విజయంవంతం చేయడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కొందరు పోలీసులు లాఠీ దెబ్బలను రుచి చూపిస్తున్నారు.

అయితే తమిళనాడులోని తిరుపూర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లమీదికి వచ్చిన యువకులను స్థానిక పోలీసులు వినూత్నంగా శిక్షించారు. ఓ వ్యక్తికి కరోనా పేషెంట్‌ మాదిరిగా దుస్తులు వేసి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారిపైకి వచ్చిన యువకులను బలవంతంగా ఆ అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అలా వేయగానే.. వారు దాంట్లోంచి కిందకు దిగేందుకు నానా ప్రయత్నాలు చేశారు. పోలీసులను ప్రాధేయపడుతూ మరోసారి ఇలా చేయమని వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 

 

Tags:    

Similar News