లాక్డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. ఈ నెల 14 వరకు ఉన్న లాక్డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. కొవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్ లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది.