పీఎం కేర్స్ ఫండ్పై పిల్.. రేపు విచారణ
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఎదురవుతున్న అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అలాగే బాధితులకు ఉపశమనం కలిగించే ప్రాధమిక లక్ష్యంతో మార్చి 28 న ప్రధానమంత్రి పిఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు.
కరోనాపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఎదురవుతున్న అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అలాగే బాధితులకు ఉపశమనం కలిగించే ప్రాధమిక లక్ష్యంతో మార్చి 28 న ప్రధానమంత్రి పిఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు.. దీనికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫిషియో చైర్మన్ అయితే.. రక్షణ, హోం మరియు ఆర్థిక మంత్రులు ఎక్స్-అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు.
అయితే పీఎం కేర్స్ ఫండ్ను రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా పిఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిఎల్ను దాఖలు చేశారు.
కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టికల్ 267 ప్రకారం దీనిని పార్లమెంట్ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ ఆమోదించలేదని. అలాగే దీనికి రాష్ట్రపతి గానీ ఆమోదం తెలపలేదని శర్మ ఆ పిల్లో పేర్కొన్నారు.
అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బదిలీ చేయాలని కోరారు. దీనిపై సోమావారం చీఫ్ జస్టిస్ ఎస్ఐ బొబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఎంఎం శాంతనగౌదర్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.