సున్నీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయొద్దని నిర్ణయించింది. సీజేఐ తీర్పు వెల్లడించగానే రివ్యూకు వెళ్తామని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపు న్యాయవాది ప్రకటించారు. అయితే సుప్రీంతీర్పును పూర్తిస్థాయిలో పరిశీలించిన వక్ఫ్ బోర్డ్ ఈ నిర్ణయానికి వచ్చింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది.