కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..

Update: 2019-06-28 13:14 GMT

ఏఐసీసీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్ధుగా ఉన్న పార్టీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం ఊపందుకుంది. అధ్యక్ష పదవి తనకొద్దంటూ రాజీనామా చేసిన రాహుల్‌గాంధీకి మద్దతుగా పలు రాష్ట్రాల పీసీసీల నుంచి పెద్ద ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, హర్యానా పీసీసీలకు చెందిన కీలక పదవుల్లో ఉన్న వారంతా రాజీనామాలు చేశారు. ఇప్పటివరకు 140 మంది రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేశారు. రాజీనామాలతో ఖాళీలైన పోస్టుల్లో సమర్థులను ఎన్నుకోవాలని రాహుల్‌కు సూచించారు.  

Tags:    

Similar News