ఒడిశాలోని రాయగఢ్- కోరాపుట్ రైలు మార్గంలో సామలేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజన్ పట్టాలు తప్పడంతో వెనుక ఉన్న రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో బోగీల నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇంజన్ నుంచి రైలును సిబ్బంది విడదీయగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. హావ్డా నుంచి జగదల్పూర్ వైపు సామలేశ్వరి ఎక్స్ప్రెస్ వెళ్తుండగా.. కెబిటిగూడ వద్ద ఈ సాయంత్రం 4.30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. 148 మంది ప్రయాణీకులను బస్సుల్లో రాయగఢకు తరలిస్తున్నట్టు తెలిపారు.