కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాలని మెజార్టీ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. శబరిమల కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది.