టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ రాజ్యసభ వెబ్సైట్లో మార్పులు చేసింది. నిన్ననే సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి బీజేపీలో చేరారు. తమను బీజేపీ ఎంపీలు పరిగణించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి లేఖ అందజేశారు. దీంతో బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం అయిపోయింది. ఈ మేరకు రాజ్యసభ వెబ్సైట్లో కూడా ఆ నలుగురిని బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తూ మార్పులు చేశారు.