ఉగ్రవాదం నశించినప్పుడే ప్రపంచ శాంతి -కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Update: 2019-08-03 13:41 GMT

ఉగ్రవాదం నశించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమని...కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ఎప్పటికీ ప్రమాదకరమేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బిడిఎల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశాలు సైతం ప్రస్తుతం దానిపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిడిఎల్ భారత్ లోనే అతి ముఖ్యమన రక్షణ సంస్థ అని, మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం ప్రేరణతోనే బిడిఎల్ ఏర్పాటు సాధ్యమైందని ఆయన తెలిపారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదిగిందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News