ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ పూర్తి సామాన్యుడిలా వ్యవహరిస్తున్నారు .. మొన్న ఢిల్లీలోని ఓ ధియేటర్ కి సామాన్యుడి లాగా వెళ్లి ఆర్టికల్ 15 అనే సినిమాని చూసారు . అంతే కాకుండా పక్కన ఉన్న వారితో మాట్లాడుకుంటూ పాప్ కార్న్ తినుకుంటూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి .. ఇప్పుడు అలాగే ఓ రెస్టారెంట్ కి వెళ్లి దోశ తిన్నారు , టీ తాగారు .. ఇందులో అయనతో పాటు రాజ్యసభ సభ్యుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ , మదన మోహన్ ఝూ, ఏఐసీసీ ప్రతినిధి శక్తికాంత్ గోహిల్ కూడా ఉన్నారు ..పరువునష్టం కేసులో భాగంగా రాహుల్ నిన్న కోర్టుకు హాజరు అయ్యారు . విచారణ అనంతరం తిరుగు ప్రయాణంలో రాహుల్ మధ్యలో కారు ఆపి ఓ రెస్టారెంట్ కి వెళ్లి దోశ తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ..
पटना में ऐक छोटे से रेस्टोरंट में राहुलजी ने खाना खाया । pic.twitter.com/XHm94gQQZt
— Shaktisinh Gohil (@shaktisinhgohil) July 6, 2019