ఉన్నావ్ ఘటన తనను కలిచివేసిందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపి సర్కార్పై నిప్పులు చెరిగిన ఆమె యూపిలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలోని ఉన్నావ్ రేప్ బాధితురాలి ఇంటికి ఇవాళ ప్రియాంకా గాంధీ వెళ్లారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. యూపీలో శాంతి, భద్రతలు అదుపుతప్పాయని నిందితులను శిక్షించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.