కరోనా నియంత్రణకి రాష్ట్రపతి విరాళం
కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే..
కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు భారీ విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక పలువురు కేంద్రమంత్రులు తమ ఒక నెల జీతం విరాళలంగా ప్రకటిస్తున్నారు. ఇక తాజాగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి గాను రాష్ట్రపతికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.