వలసకూలీల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Update: 2020-05-16 06:36 GMT

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఔరాయా జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని గుర్తుచేశారు. 

Tags:    

Similar News