Coronavirus: ప్రధాని ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం.. వివిధ కీలక అంశాలపై చర్చ
ప్రధాని ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగుతోంది. వివిధ కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని మోడీ తెలిపారు. అలాగే కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా విమానాలు నిలిపివేశారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటికే పరిమితమవ్వాలని, 10 ఏళ్ల లోపు పిల్లలు బయటకు రానివ్వొద్దని తెలిపారు.NarendraModi