PM Modi: జోర్దాన్ రాజుకు మోడీ ఫోన్ కాల్.. గల్ఫ్ భారతీయుల భద్రతపై కీలక భరోసా!
PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
PM Modi: జోర్దాన్ రాజుకు మోడీ ఫోన్ కాల్.. గల్ఫ్ భారతీయుల భద్రతపై కీలక భరోసా!
PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయల భద్రత అంశంపై ఇరువురు నేతలు సుధీర్గంగా చర్చించారు.
జోర్దాన్ , ఇతర గల్ప్ దేశాల్లో ఉన్న భారతీయ సమాజం క్షేమంగా ఉండేలా చూడాలని ప్రధాని కోరారు. భారతీయులకు జోర్దాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జోర్దాన్ లో శాంతి, సుస్తిరతలను కాపాడటంలో భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.