పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటి వరకు 11 పిటిషన్లు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని దెబ్బతీసేలా చట్టం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మతం ప్రాతిపదికన బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలను అనర్హలుగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు.