Odisha: ప్రజలను హడలెత్తించిన భారీ కొండచిలువ

* ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఘటన *స్నేక్ హెల్ప్‌లైన్‌కు స్థానికులు సమాచారం *పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టిన సభ్యులు

Update: 2021-09-18 14:45 GMT

ఒడిశాలోని జాజ్‌పూర్‌లో భారీ కొండచిలువ

Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఓ భారీ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై ఇండియన్ రాక్ కొండచిలువ బుసలు కొట్టడంతో స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న హెల్ప్‌లైన్ సభ్యులు కొండచిలువను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇదే సమయంలో భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Tags:    

Similar News