పాకిస్తాన్లో ఓ ఆర్మీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా మరో 12 మందికి తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. రావల్పిండి నగరంలో ఉన్న ఓ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. శిక్షణ విన్యాసాలు చేస్తున్న సమయంలో విమానం కూలింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలడంతో అనేక ఇల్లులు మంటలకు దగ్ధమయ్యాయి. మిలిటరీ విమానం ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బిల్డింగ్లు మొత్తం నల్లగా మసకబారిపోయాయి. ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.