భారత సైన్యం ధాటికి తోక ముడిచిన పాకిస్ధాన్

Update: 2019-09-14 06:50 GMT

భారత సైన్యం ధాటికి పాకిస్ధాన్ తోక ముడిచింది. కయ్యానికి కాలు దువ్వి కదన రంగంలో ముందడుగు వేయలేక భారత సైన్యం ముందు సాగిలపడింది. తెల్ల జెండా చూపి కాల్పులు ఆపమంటూ ప్రాధేయపడింది. హాజీపూర్ సెక్టార్లో ఈ నెల 10, 11 తేదిల్లో భారత సైన్యం లక్ష్యంగా పాకిస్ధాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. పాక్ సైనికులను ధీటుగా ఎదుర్కొంటూ తుపాకి గుళ్లతో విరుచుకుపడ్డాయి. దీంతో ఇద్దరు పాకిస్దాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఎదురు కాల్పులు కొనసాగితే మరింత ప్రాణ నష్టం తప్పదనుకున్న పాకిస్ధాన్ సైన్యం ... లొంగిపోతున్నామంటూ తెల్లజెండాలు ప్రదర్శించింది. యుద్ధ ధర్మం మేరకు భారత సైన్యం కాల్పులు ఆపివేయడంతో ... పాకిస్ధాన్ సైనికులు తమ సహచరుల మృతదేహాలను తీసుకుని పరారయ్యారు. ఈ నెల 10,11 తేదిల్లో ఇరు దేశాల మధ్య జరిగిన ఈ కాల్పుల వ్యవహారాన్ని భారత సైన్యం తాజాగా విడుదల చేసింది.   

Tags:    

Similar News