ఆ ముగ్గురు జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలి : ఢిల్లీ సీఎం

Update: 2020-04-29 09:03 GMT

ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. వైర‌స్ సోకిన జ‌ర్న‌లిస్టులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. మెజార్టీ జర్నలిస్టులకు కరోనా నెగిటివ్‌ రావడం సంతోషకరమైన విషయమన్నారు. జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. 

Tags:    

Similar News