Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్

Jammu Kashmir: ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైనికుల వేట

Update: 2021-10-24 10:03 GMT

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత (ఫైల్ ఇమేజ్)

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఎగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత 12రోజులకు పైగా భారత సైన్యం పూంచ్‌ సెక్టార్‌ను జల్లుడపడుతోంది. ఈ క్రమంలో టెర్రరిస్టులు భారత సైనికుల మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఇదే ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో టెర్రరిస్టులు అడపాదడపా సైనికులపై కాల్పులు జరిపి అడవిలోకి జారుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉగ్రమూలకు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా భారత సైన్యాన్ని చూసి కంగుతిన్న ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక ఆర్మీ జవాన్‌కు గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఎల్‌ఈటీ ఉగ్రవాది జియాముస్తఫాకు కూడా గాయాలు అయినట్లు అధికారులు తెలిపాకరు.

Tags:    

Similar News