దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిర్భయ తల్లి స్పందన

Update: 2019-12-06 05:15 GMT
ఆశాదేవి

దిశ నిందితుల ఎన్కౌంటర్‌ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దిశకు న్యాయం జరిగింది, కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 'దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. పోలీసులపై ఏ విధమైన కేసులు పెట్టరాదని, విచారించరాదని ఆశాదేవి అభిప్రాయపడ్డారు. తాను న్యాయం కోసం గత ఏడేళ్ల నుంచి కోర్టు స్తంభాలను పట్టుకుని ఉన్నానని, ఇప్పటికీ నిందితులకు శిక్ష అమలు కాలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థ నేరస్తులను శిక్షించడంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తన కుమార్తెను చంపిన వారిని సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News