నిర్భయ హత్యాకాండ నిందితుడు వినయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వ్యాఖ్యలను ఖండించాడు. తానెన్నడూ క్షమాభిక్ష కోరలేదన్నాడు ఇందులో ఏదో కుట్ర జరిగిందని వినయ్ శర్మ లాయర్ వ్యాఖ్యానించారు. తామేనాడు మెర్సీ పిటిషన్ పెట్టలేదని, తన క్లయింట్ పేరు మీద రాజకీయ పార్టీలు కొత్తనాటకం మొదలు పెట్టాయని ఆరోపించారు. తన పేరుతో రాష్ట్రపతికి చేరిన క్షమాభిక్ష పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలన్నారు.