జమ్ముకాశ్మీర్లో కాల్పులు... 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులు హతం
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల్ని భద్రత బలగాలు మట్టుపెట్టాయి. కశ్మీర్ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు.
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల్ని భద్రత బలగాలు మట్టుపెట్టాయి. కశ్మీర్ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. కెరాన్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ దాటి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరుల్ని సైనికులు గుర్తించి వెంటనే అలర్ట్ అయి వారిపై కాల్పులు జరిపారు.
బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.ఎల్వోసీలోని కెరాన్ సెక్టార్లో సరిహద్దు దాటుతున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు కాల్చి చంపాయి. కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి.