సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లుపై..అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎంపీ విజయ సాయిరెడ్డి
సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లులో 17 అబధ్దాలున్నాయని విజయసాయి రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. 66 నెలల తర్వాత ఈ చట్టాన్ని తీసుకువచ్చారని..ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యూనివర్సిటీకి 950 కోట్లు అవసరమైతే.. ఇప్పటి వరకు 18 కోట్లు మంజూరు చేశారని విజయసాయి తన అసంతృప్తి వ్యక్తం చేశారు.