సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

Update: 2019-07-21 10:46 GMT

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి సురవరం సుధాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం మరొక రెండు సంవత్సరాలు ఉండగా అనారోగ్య కారణాలతో పదవీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. సురవరం స్థానంలో సీపీఐ నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి. రాజా(70)ను ఎన్నుకున్నారు. తమిళనాడుకు చెందిన డి.రాజా యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాడులో పలు ఉద్యమాలకు నేతృత్వం వహించారు. 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

Tags:    

Similar News