కరీంనగర్ పోలీసులపై NHRC కేసు

Update: 2019-11-07 10:25 GMT

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‌ఫిర్యాదుతో కరీంనగర్ పోలీసులపై NHRC కేసు నమోదు చేసింది. ఇటీవల మరణించిన డ్రైవర్ బాబు అంత్యక్రియల్లో తనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ బండి సంజయ్ NHRCకి ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసుల దాడిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సంజయ్ ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందజేశారు. ఘటన వివరాలను స్పీకర్ ఓం బిర్లా అడిగి తెలుసుకున్నారు. ఫొటోలు, వీడియోలు, పత్రికా కథనాలను స్పీకర్ పరిశీలించారు.  

Tags:    

Similar News