తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 7న నోటిఫికేషన్

Update: 2019-08-01 11:58 GMT

తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఆగస్ట్ 26న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదిగా ప్రకటించింది ఈసీ. ఏపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, కృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి, తెలంగాణలో యాదవరెడ్డి రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడింది.  

Tags:    

Similar News