ఢిల్లీ కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలోని బవానా కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2020-05-10 05:02 GMT

ఢిల్లీలోని బవానా కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది.ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. ఉదయం 7.55 గంటల సమయంలో బవానా ఫ్యాక్టరీలో మంటలు సంభవించాయని అధికారులు తెలిపారు, దాంతో మంటలు ఆపేందుకు 14 ఫైర్ ఇంజన్ లను అక్కడికి తెప్పించారు. అగ్నిమాపక కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆస్తినష్టం మినహా ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News