మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తానూ ప్రస్తుతం ఎన్సీపీలోనే ఉన్నానని, అదే పార్టీలో ఉంటానని, మా నేత బాబాయి శరద్ పవారే అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిణామాలు అన్ని బాగానే ఉన్నాయని, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, కొంత ఓపిక అవసరమని మరో ట్వీట్ చేశారు అజిత్ పవార్ .. బీజేపీ-ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాయని అయన పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
I am in the NCP and shall always be in the NCP and @PawarSpeaks Saheb is our leader.
— Ajit Pawar (@AjitPawarSpeaks) November 24, 2019
Our BJP-NCP alliance shall provide a stable Government in Maharashtra for the next five years which will work sincerely for the welfare of the State and its people.