మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు స్పీకర్ ప్రజాపతి షాక్ ఇచ్చారు. బలపరీక్ష నిర్వహించకుండానే అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ నెల 26 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నేడు బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు. బలపరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని కోరుతూ గవర్నర్కు సీఎం కమల్నాథ్ లేఖ రాశారు.