రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఆనుకొని ఉంది. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.