Mumbai : లోకల్ ట్రైన్‎లో మంటలు...పూర్తిగా కాలిన బోగీ

ముంబైలోని లోకల్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని పన్వేల్ - సీఎస్ఎంటీ లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వాషి స్టేషన్ వద్దకు రాగానే ఈ ప్రమాద జరిగింది.

Update: 2019-10-09 08:09 GMT

ముంబైలోని లోకల్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని పన్వేల్ - సీఎస్ఎంటీ లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వాషి స్టేషన్ వద్దకు రాగానే ఈ ప్రమాద జరిగింది. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బోగీ కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలుకాలేదని తెలుస్తోంది. మొదట షార్ట్ సర్యూట్ గా భావించింన అధికారులు అప్రమత్తమైయ్యారు. ట్రైన్ బోగీపై ఉన్న పాంటోగ్రాఫ్ నుంచి భారీగా పొగ ఎగిసిపడింది. దగ్థమైన బోగిని షెడ్డుకు పంపారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి బ్యాగును పడివేయడం వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి రైల్వే అధికారులు తమ అధికారిక ట్విటర్లో పోస్టు చేశారు.






Tags:    

Similar News