కుమారస్వామి...రాజీనామా చేయండి

Update: 2019-07-08 09:09 GMT

కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ సంక్షోభంలో బీజేపీ ప్రమేయం లేదని ఆ పార్టీ సీనియర్ నేత శోభ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాలను వేచి చూస్తున్నామని స్పీకర్ నిర్ణయం తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని శోభ అన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ రాజీనామా చేసి బీజేపీకి మద్దతిస్తానని తెలపడంపై శోభ మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అసమ్మతి నేతలతో బీజేపీ నేతలెవ్వరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మెజారిటీ కోల్పోయినందున ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. మరో ప్రభుత్వం ఏర్పాటు కోసం కుమార స్వామి దారివ్వాలన్నారు. 

Tags:    

Similar News